న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: జడ్జిలపై ప్రభుత్వాలు దుష్ప్రచారం చేయడం కొత్త ట్రెండ్గా మారిందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అమన్ సింగ్, ఆయన భార్య యాస్మిన్ సింగ్పై 2020లో అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసు నమోదైంది. దీనిని ఛత్తీస్గఢ్ హైకోర్టు కొట్టేసింది. తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసం శుక్రవారం విచారణ జరిపింది. ఛత్తీస్గఢ్ హైకోర్టు కేసును కొట్టేసిన విధానంపై పిటిషనర్ తరఫు లాయర్ చెప్తుండగా… జస్టిస్ రమణ జోక్యం చేసుకొన్నారు. ‘మీ వాదన వైపు నిలబడండి ఇబ్బంది లేదు. కానీ కోర్టులపై దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నించకండి’ అని వ్యాఖ్యానించారు.