న్యూఢిలీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో కేసును వేగంగా విచారించడానికి సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసుపై విచారణ జరుపనున్నది. ఈ నెల 27న ధర్మాసనం వాదనలు విననున్నది.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానోపై గ్యాంగ్రేప్ జరిగినట్టు కేసు నమోదు కాగా, 11 మందిని కోర్టు దోషులుగా తేల్చింది. అయితే కొద్దిరోజుల కిందట వీరికి క్షమాభిక్ష పెట్టడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.