డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఈసారి కొత్త రికార్డు నమోదైంది. ఇంతకుమునుపెన్నడూ లేని విధంగా చార్ధామ్ యాత్రలో పాల్గొన్న వారి సంఖ్య 50 లక్షలు దాటింది. ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లో దేవభూమిగా పిలిచే బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను సందర్శించడాన్నే చార్ధామ్ యాత్ర అంటారు. ఈ నాలుగు క్షేత్రాలను ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా దర్శించుకున్నారని అధికారులు ప్రకటించారు. పోలీస్ రికార్డుల ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 16 నాటికి ఈ సంఖ్య నమోదైందన్నారు.