హైదరాబాద్ : న్యూఢిల్లీ శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి 31 వరకు నిరాడంబరంగా జరుగనున్నాయి. బ్రహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న అంకుర్పారణ, 23 ధ్వజారోహణం నిర్వహించనున్నారు. కొవిడ్ ఉధృతి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని, వాహన సేవలను సైతం ఆలయానికే పరిమితం చేస్తామని ఆలయ వర్గాలు తెలిపాయి. భక్తులెవరూ ఆలయానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.