External Affairs Ministry | అరుణాచల్ప్రదేశ్లోని భారత్ భూభాగంలో చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందని అమెరికా రక్షణశాఖ వెల్లడించిన నివేదికపై కేంద్రం స్పందించింది. ఆ ప్రాంతం 60 ఏండ్లుగా చైనా సైనిక నియంత్రణలోనే ఉందని సైనిక వర్గాలు తెలిపాయి. అరిందం బాగ్జి పేర్కొన్నారు. మనదేశ భూభాగంలో చైనా ఆక్రమణతోపాటు ఆ దేశం వాదనను కూడా భారత్ ఏనాడూ అంగీకరించలేదని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు. దశాబ్దాల క్రితమే ఆక్రమించిన ప్రాంతాలతోపాటు సరిహద్దుల్లో కొన్నేండ్లుగా నిర్మాణాలు చేపట్టిందన్నారు.
కానీ, దాని ఆక్రమణలు, వాదనలను భారత్ ఏనాడూ అంగకరించలేదని స్పష్టం చేశారు. దీనిపై ఎప్పటికప్పుడు దౌత్యమార్గాల ద్వారా తీవ్ర నిరసన తెలిపామని, భవిష్యత్లోనూ నిరసన కొనసాగిస్తామన్నారు. అయితే, సరిహద్దుల వెంబడి స్థానిక జనాభా కోసం రోడ్లు, వంతెనల నిర్మాణంతోపాటు మౌలిక వసతుల కల్పన మమ్మురం చేశామన్నారు. అరుణాచల్ప్రదేశ్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.