న్యూఢిల్లీ : నెహ్రూ మ్యూజియం పేరును మార్చాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై మ్యూజియాన్ని పీఎం మ్యూజియంగా మార్చింది. దేశానికి ప్రధానులుగా పని చేసిన 14 మంది మాజీ ప్రధానులకు చెందిన జ్ఞాపకాలను ఇక్కడ భద్రపరచనున్నారు. అంబేద్కర్ జయంతి రోజున అంటే.. 14న ప్రధాని నరేంద్ర మోదీ మ్యూజియాన్ని ప్రారంభించింది. 14 మంది మాజీ ప్రధానుల సేవలను గుర్తించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో అన్నారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియంలో మాజీ ప్రధానులందరి రచనలను ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రులందరి సహకారాన్ని తమ ప్రభుత్వం గుర్తించేలా చేసిందన్నారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని సందర్శించాలని ఎంపీలను ప్రధాని కోరారు.