న్యూఢిల్లీ, ఆగస్టు 25: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2022 ఫలితాలు వచ్చే నెల 7న విడుదల చేయనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం ప్రకటించింది. ఆన్సర్ కీని ఈ నెల 30న విడుదల చేయనున్నట్టు తెలిపింది.
ఆన్సర్ కీ, ఫలితాలను నీట్ వెబ్సైట్ neet.nta.nic.in లో చూడొచ్చని అభ్యర్థులకు సూచించింది. గత నెల 17న నీట్ యూజీ పరీక్షను నిర్వహించారు. 18.72 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 95 శాతం మంది పరీక్షకు హాజరైనట్టు ఎన్టీఏ తెలిపింది.