న్యూఢిల్లీ: నీట్-యూజీ 2024(NEET-UG 2024) పరీక్షలో వ్యవస్థీకృత ఉల్లంఘన జరగలేదని సుప్రీంకోర్టు తెలింది. పరీక్ష పత్రాల లీకేజీ కేవలం పాట్నా, హజారిబాగ్లో మాత్రమే జరిగినట్లు అత్యున్నత న్యాయ స్థానం వెల్లడించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతో పాటు కేంద్ర సర్కారు కూడా మళ్లీ భవిష్యత్తులో పేపర్ లీకేజీ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. ఎగ్జామ్ వ్యవస్థలో ఉన్న సైబర్ సెక్యూర్టీ లోపాలను సరిదిద్దేందుకు వీలైన సాంకేతికతకు తీసుకురావాలని కేంద్రం నియమించిన కమిటీ పేర్కొన్నట్లు సుప్రీం తన తీర్పులో చెప్పింది. ఎన్టీఏ వ్యవస్థలో ఉన్న లోపాలను కూడా తమ తీర్పులో పేర్కొన్నట్లు సుప్రీం తెలిపింది.
#WATCH | Advocate Shwetank Sailakwal says “Supreme Court has laid down various guidelines regarding paper leak. The court has taken note of the paper leak which happened in Hazaribagh and Patna, and a committee was also formed. Supreme Court has directed the committee to… https://t.co/YoKEthMAE4 pic.twitter.com/md4E9y4U1x
— ANI (@ANI) August 2, 2024