న్యూఢిల్లీ, జూన్ 6: నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ప్రశ్న పత్రం లీక్ అయిందనీ లేదా అమ్ముడుపోయిందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శనివారం తోసిపుచ్చింది. ఈ ప్రచారాన్ని అసత్యం, మోసపూరితంగా ఎన్టీఏ కొట్టి వేసింది. అలాంటి ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఏ హెచ్చరించింది. నీట్-యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నపత్రం లీక్ అయిందని, ముందస్తుగా అందుబాటులో ఉందని లేదా అమ్మకం జరిగిందని పేర్కొంటూ వచ్చిన సందేశాలు విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పు దోవ పట్టించే లక్ష్యంతో ఉన్నాయని ఎక్స్ పోస్టులో ఎన్టీఏ పేర్కొంది. నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ జూన్ 21న జరగనున్నది.