NEET PG | దేశవ్యాప్తంగా రేపు జరగాల్సిన నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే ) వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వైద్యారోగ్య శాఖ తెలిపింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్షను వాయిదా వేసింది.
నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్టీయే డైరెక్టర్ సుబోధ్కుమార్ను శనివారం రాత్రి విధుల్లో నుంచి తొలగించింది. ఆయన స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవిలో కొనసాగుతారు.
రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా సుబోధ్ కుమార్ సింగ్ మీడియాకు దూరంగా ఉండేవాడని, లో ప్రొఫైల్ లో కొనసాగేవాడని సమాచారం.ఉత్తరప్రదేశ్ కు చెందిన సుబోధ్ కుమార్ సింగ్.. ఐఐటీ రూర్కేలాలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇగ్నో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గతేడాది జూన్ లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అదనపు సెక్రటరీగా పని చేశారు. ఛత్తీస్ గఢ్ సెక్రటేరియట్ లో 2009-2019 మధ్య పలు హోదాల్లో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి.