న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా నీట్ పీజీ కౌన్సెలింగ్పై ఏర్పడిన అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో బుధవారం నుంచి కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 27 శాతం ఓబీసీ, 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కోటా ఆధారంగానే కౌన్సెలింగ్ నిర్వహణకు సుప్రీంకోర్టు శుక్రవారం అనుమతించిన విషయం తెలిసిందే.