NEET PG | న్యూఢిల్లీ: నీట్ పీజీ 2024 పరీక్షను జూన్ 23న నిర్వహించనున్నట్టు బుధవారం నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ప్రకటించింది. మొదట జూలై 7న పరీక్ష జరిపేందుకు షెడ్యూల్ ఖరారు కాగా ఇప్పుడు జూన్ 23న నిర్వహించేందుకు రీషెడ్యూల్ చేసింది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీతో ఎన్ఎంసీ పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు జరిపిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నీట్ పీజీ పరీక్ష ఫలితాలు జూలై 15న వెలువడనున్నాయి. ఆగస్టు 5వ తేదీ నుంచి అక్టోబరు 15వ తేదీ వరకు అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 16 నుంచి కొత్త అకాడమిక్ సెషన్ ప్రారంభం కానున్నది.