న్యూఢిల్లీ, జనవరి 21: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (నీట్ ఎండీఎస్ 2024) మార్చి 18కి వాయిదా పడింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంఎస్) ప్రకటించింది. నిజానికి ఈ పరీక్ష ఫిబ్రవరి 9న జరగాల్సి ఉంది. నీట్ ఎండీఎస్ 2024 రాసేందుకు అర్హత కటాఫ్ డేట్ను మార్చి 31గా పేర్కొన్నది. కాగా, నీట్ పీజీ 2024 పరీక్షను ఎన్బీఈఎంఎస్ ఇప్పటికే వాయిదా వేసింది. జూలై 7న పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నది.