న్యూఢిల్లీ, జనవరి 6: నీట్ పీజీ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కోటాకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం గురువారం తీర్పును రిజర్వ్ చేసింది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా కౌన్సెలింగ్ను ప్రారంభించాల్సిన అవసరం ఉన్నదని కోర్టు వ్యాఖ్యానించింది. రూ.8 లక్షల వార్షిక ఆదాయం కన్నా తక్కువ ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ కోటాకు అర్హులంటూ కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ నీట్ పీజీ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విష యం తెలిసిందే. నీట్ పీజీ కౌన్సెలింగ్ త్వరగా జరిగేలా చూడాలని ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.