జైపూర్: దేశ వ్యాప్తంగా వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష రాసిన అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీట్ రద్దుతో మనస్తాపం చెందిన అతడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. (NEET Aspirant Suicide) నీట్ ఎగ్జామ్లో 650 మార్కులు వస్తాయని తన కుమారుడు చెప్పినట్లు తండ్రి వాపోయారు. కనికా కి ధాని గ్రామానికి చెందిన ప్రదీప్ మేఘ్వాల్, గత మూడేళ్లుగా తన ఇద్దరు సోదరీమణులతో కలిసి సికార్లో నివసిస్తున్నాడు. నీట్ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. మే 3న నీట్ పరీక్ష రాశాడు.
కాగా, పేపర్ లీక్ నేపథ్యంలో నీట్ పరీక్షను ఎన్డీఏ రద్దు చేసింది. దీంతో ప్రదీప్ తీవ్ర మనస్తాపం చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం సీలింగ్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన అక్క వెంటనే కత్తెరతో స్కార్ఫ్ను కత్తిరించింది. ఇంటి యజమాని, పోలీసులకు సమాచారం అందించింది. అతడ్ని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
మరోవైపు నీట్ పరీక్షలో తన కుమారుడు బాగా రాణించాడని, 650 మార్కులు సాధిస్తానని చెప్పాడని తండ్రి రాజేష్ కుమార్ మేఘ్వాల్ పోలీసులకు తెలిపారు. ఈసారి ప్రభుత్వ వైద్య సీటు ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నాడని చెప్పారు. అయితే నీట్ పరీక్ష రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడని, డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విలపించారు.