న్యూఢిల్లీ: బుల్లీ బాయ్ యాప్ కేసులో ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ను ఢిల్లీ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ముస్లిం మహిళల ఫోటోలను ఆన్లైన్లో వేలం వేస్తున్నట్లు పోస్టు చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ కేసులో బెంగుళూరుకు చెందిన ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి విశాల్ కుమార్తో పాటు ఉత్తరాఖండ్కు చెందిన మహిళను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో ఇవాళ ఢిల్లీ పోలీసులు కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో అస్సాంకు చెందిన ప్రధాన నిందితుడు నీరజ్ బిష్ణోయ్ను అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులకు చెందిన ఐఎఫ్ఎస్వో స్పెషల్ సెల్ అతన్ని అరెస్టు చేసింది.
బుల్లీ యాప్ కేసులో నీరజ్ ప్రధాన నిందితుడని డీసీపీ కేపీఎస్ మల్హోత్రా తెలిపారు. గిట్హబ్ ఫ్లాట్ఫామ్పై అతనే ఆ యాప్ను క్రియేట్ చేశాడన్నారు. ఆ యాప్కు చెందిన ప్రధాని ట్విట్టర్ అకౌంట్ హోల్డర్ కూడా అతనేనన్నాడు. అతన్ని ఢిల్లీకి తీసుకువస్తున్నట్లు మల్హోత్రా తెలిపారు. నీరజ్ బిష్ణోయ్ వయసు 20 ఏళ్లు. అస్సాంలోని జోర్హట్ అతని స్వస్థలం. జోర్హట్లోని దిగంబర్ ప్రాంతంలో అతన్ని అరెస్టు చేశారు. భూపాల్లోని వెల్లోర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అతను ఇంజినీరింగ్ చదువుతున్నాడు.