న్యూఢిల్లీ, డిసెంబర్ 28: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)కు తొలి మహిళా చీఫ్గా నీనా సింగ్ నియమితులయ్యారు.
వచ్చే ఏడాది జూలై 31 వరకు ఆమె ఈ పదవిలో ఉంటారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన నీనాసింగ్ ప్రస్తుతం సీఐఎస్ఎఫ్ స్పెషల్ డీజీగా పనిచేస్తున్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డీజీగా దయాల్ సింగ్ నియమితులయ్యారు.