న్యూఢిల్లీ: కరోనా వేరియంట్ బీఎఫ్.7పై భయం వద్దని కేంద్ర కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. పొరుగు దేశమైన చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి మాండవియా శుక్రవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. కొత్త రకం కరోనా వేరియంట్ను ఎదుర్కొనేందుకు సంసిద్ధతతో ఉండాలని సూచించారు.
కరోనాను ఎదుర్కోవడంలో భారత్కు మూడేళ్ల అనుభవం ఉందని కేంద్ర మంత్రి మాండవియా గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బీఎఫ్.7 కరోనా వైరస్ను రాష్ట్రాలు ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
కరోనా పరీక్షలను మరింతగా పెంచడం, జీనోమ్ సీక్వెన్సింగ్, కరోనా నియంత్రణ పద్ధతులు పాటించడం ద్వారా ఈ మహమ్మారిని ఎదుర్కోవచ్చని కేంద్ర మంత్రి మాండవియా సూచించారు. ‘టెస్ట్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్’ పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు. అలాగే కొత్త ఏడాది వేడుకలు, రాబోయే పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. మాస్క్ ధరించడం, చేతుల పరిశుభ్రత, భౌతిక దూరం పాటించడం వంటి పద్ధతులకు ప్రజలంతా కట్టుబడి ఉండాలన్నారు.
Emphasized on the need to be alert in COVID-19 review meeting with State Health Ministers.
There is no need to panic. We have 3 years of experience in pandemic management. The Centre Govt will provide all the support to combat COVID-19. We will take action as per the needs. pic.twitter.com/z4QsMZMbEX
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) December 23, 2022
MoHFW directs all States/UTs to focus on 'Test-Track-Treat &Vaccination' and adherence of COVID19 appropriate behaviour of wearing mask, maintaining hand hygiene and physical distancing, considering the upcoming festival season and new year celebrations pic.twitter.com/YiNrXKe6mW
— ANI (@ANI) December 23, 2022