ఉత్తర్కాశీ : ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీలో నిర్మాణంలో ఉన్న సొరంగంలోని కొంతభాగం ఆదివారం కూలిపోయింది. అందులో చిక్కుకున్న 40 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారని.. వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి సోమవారం వెల్లడించారు.
కార్మికులకు ఆహార పానీయాలు అందించామని పోలీసులు తెలిపారు. సొరంగం లోపల ఊడిపడుతున్న పెచ్చులను ఆపడానికి కాంక్రీట్ స్ప్రే చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.