న్యూఢిల్లీ : హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ మరింత ముమ్మరం చేసింది. గాజా స్ట్రిప్లోని ఖాన్ యూనిస్ పట్టణంపై శుక్రవారం రాత్రి ట్యాంకులు, గగనతల బాంబు దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 24 గంటల్లో దాదాపు 200 మంది మరణించారు.
సెంట్రల్ గాజాలోని నుసీరట్ క్యాంప్పై విమానాలు వరుస బాంబు దాడులు చేశాయని మెడిక్స్, పాలస్తీనియన్ పాత్రికేయులు తెలిపారు. ఖాన్ యూనిస్ పట్టణంలోని చాలా భాగాలపై డిసెంబరులోనే ఇజ్రాయెలీ దళాలు పట్టు సాధించాయి. రక్షణ మంత్రి యొఅవ్ గల్లంట్ మాట్లాడుతూ, తమ దళాలు హమాస్ కమాండ్ సెంటర్లు, ఆయుధాల డిపోల వద్దకు చేరుకుంటున్నాయన్నారు.