న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: భారతదేశంలో కరోనా మరణాలు 2 లక్షలకు చేరువలో ఉన్నాయి. సోమవారం నుంచి మంగళవారం ఉదయానికి 24 గంటల్లో 2,771 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,97,894కు పెరిగింది. కొత్తగా 3,23,144 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు (3,52,991) కేసులతో పోలిస్తే కొత్త కేసులు 30వేల దాకా తగ్గడం గమనార్హం.