న్యూఢిల్లీ, నవంబర్ 11: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్-ఎస్’ను ఈనెల 15న ప్రయోగించనున్నట్టు హైదరాబాద్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ శుక్రవారం తెలిపింది. శ్రీహరికోటలోని ఇస్రో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించనున్న ఈ రాకెట్ ద్వారా మూడు కస్టమర్ పేలోడ్ల(దేశీయ-2, విదేశీ-1)ను నింగిలోకి పంపనున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ చేపడుతున్న ఈ తొలి మిషన్కు ‘ప్రారంభ్’ అని పేరుపెట్టారు. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, 15న ఉదయం 11.30 గంటలకు రాకెట్ ప్రయోగం ఉంటుందని స్కైరూట్ సీఈవో, సహ వ్యవస్థాపకుడు పవన్కుమార్ చందన తెలిపారు. విక్రమ్-ఎస్ ప్రయోగంతో దేశంలోనే తొలిసారి నింగిలోకి రాకెట్ను పంపనున్న ప్రైవేట్ కంపెనీగా ‘స్కైరూట్ ఏరోస్పేస్’ చరిత్ర సృష్టించనున్నది. భారత అంతరిక్ష పరిశోధనలకు ఆద్యుడు, ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్కి నివాళిగా రాకెట్కు విక్రమ్-ఎస్ అని పేరు పెట్టారు.