ముంబై: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (NCP) చీఫ్ శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ రాజీనామాను ఆ పార్టీకి చెందిన నేతలు ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. శరద్ పవారే తమ పార్టీ చీఫ్గా కొనసాగాలని ఎన్సీపీ ప్యానెల్ డిమాండ్ చేసింది. 1999లో శరద్ పవార్ ఎన్సీపీ పార్టీని స్థాపించారు. అయితే 82 ఏళ్లకు చెందిన పవర్ తన పార్టీ హోదా నుంచి తప్పుకోనున్నట్లు ఇటీవల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబైలోని పార్టీ ఆఫీసులో మీటింగ్ జరిగింది. శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే, అజిత్ పవార్లు ఆ మీటింగ్కు హాజరయ్యారు. ప్రస్తుతం ఎన్సీపీ చీఫ్గా శరద్ పవారే కొనసాగుతారని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు.
ఇవాళ జరిగిన మీటింగ్లో ఏకగ్రీవ తీర్మానం పాస్ చేశారు. ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా శరద్ పవార్ కొనసాగాలని ఆ తీర్మానంలో కోరారు. అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడాన్ని పార్టీలోని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నట్లు ప్రఫుల్ పటేల్ వెల్లడించారు. శరద్ పవారే పార్టీ ప్రెసిడెంట్గా కొనసాగాలని కోరుతున్నామని, లక్షల మంది మనోభావాలను గౌరవించాలని, అధ్యక్షుడిగా ఆయనే కొనసాగాలని అన్నారు.