Text Books | న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ లేదా ఎస్సీఈఆర్టీ ఆమోదించిన టెక్ట్స్బుక్స్, మెటీరియల్ను మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు ఉపయోగించాలని రాష్ర్టాలకు ‘ఎన్సీపీసీఆర్’ (నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్) లేఖ రాసింది. స్కూల్ నోటీస్ బోర్డులు, వెబ్సైట్స్ ద్వారా ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరింది.
విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలల్లోని సిలబస్, పాఠ్యపుస్తకాలు, మూల్యాంకన పద్ధతుల్లో ఏకరూపత ఉండేలా చూడాలని పాఠశాల విద్య కార్యదర్శులు, ప్రిన్స్పల్ కార్యదర్శులకు తెలిపింది. పాఠ్యప్రణాళిక మార్గదర్శకాలను కఠినంగా అమలు చేయవలసిన అవసరాన్ని లేఖలో వివరించింది. ప్రైవేట్ సంస్థలు ప్రచురించిన పుస్తకాలను కొన్ని స్కూల్స్ అనుసరిస్తున్నాయన్న నివేదికలపై ఆందోళన వ్యక్తం చేసింది.