న్యూఢిల్లీ, ఆగస్టు 26: నిల్వల నిమిత్తం నేషనల్ కోఆపరేటివ్ కంజ్యూమర్స్ ఫెడరేషన్(ఎన్సీసీఎఫ్) భారీగా ఉల్లి కొనుగోలు చేపట్టింది. గత నాలుగు రోజుల వ్యవధిలో ప్రధానంగా మహారాష్ట్రతో పాటు పలు ఇతర రాష్ర్టాల రైతుల నుంచి నేరుగా 2,826 టన్నుల ఉల్లిపాయలను కొనుగోలు చేసినట్టు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
క్వింటాల్ ఉల్లికి రూ.2,410 చొప్పున చెల్లించినట్టు తెలిపింది. ప్రభుత్వం ఈ ఏడాది ఉల్లి బఫర్ స్టాక్ లక్ష్యాన్ని భారీగా పెంచింది. ఈ నేపథ్యంలో సహకార సంస్థలైన ఎన్సీసీఎఫ్తో పాటు నాఫెడ్ లక్ష టన్నుల ఉల్లి చొప్పున రైతుల నుంచి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.