ముంబై: ముంబై విమానాశ్రయంలో భారీగా హెరాయిన్ ( heroin) పట్టుబడింది. ముందస్తు సమాచారం మేరకు ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన ఓ ప్రయాణికుడి వద్ద 3.980 కిలోల హెరాయిన్ పట్టుబడింది. అతని వద్ద ఉన్న సుట్కేస్లో నాలుగు ప్యాకెట్లలో మత్తుమందును తీసుకొస్తున్నాడని అధికారులు తెలిపారు. దాని విలువ రూ.24 కోట్లు ఉంటుందని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశామని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.