న్యూఢిల్లీ : కేంద్రంలో నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై నేషనల్ కాన్ఫరెన్స్ నేత షేక్ ముస్తఫా కమల్ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. 2016లో యూరీ దాడి, 2019లో పుల్వామా దాడులను కేంద్ర ప్రభుత్వమే ప్లాన్ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడిలో మరణించిన సైనికులందరూ దళితులేనని, వారి మృతదేహాలు, ఫొటోలు కూడా గుర్తించలేదని దుయ్యబట్టారు.
ఈ దాడులకు ప్రభుత్వమే ప్రణాళికలు రూపొందించిందనేది సుస్పష్టమని, ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఫొటోలను, మృతదేహాలను మనం చూడలేదని అన్నారు. అసలు ఈ మరణాలకు బాధ్యులెవరనేది తేలేవరకూ భారత ప్రభుత్వ ఏజెన్సీల వైపే అందరి సందేహాలూ కేంద్రీకృతమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ దాడుల్లో మరణించిన 30, 40 మంది సైనికులందరూ దళితులేనని ముస్తఫా కమల్ పేర్కొన్నారు.