Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో ఓ మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. ఆ మావోయిస్టు వద్ద ఉన్న 80 బాంబులు, జిలెటిన్ రాడ్, రెండు డిటోనేటర్లు, బాణాసంచాతో పాటు మావోయిస్టు సాహిత్యంను పోలీసులు సీజ్ చేశారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో హేమ్లా నంద అనే మావోయిస్టు పట్టుబడినట్లు పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో సీఆర్పీఎఫ్ బలగాలు కూడా పాల్గొన్నారు. నహది, చోటిహిడ్మా గ్రామాల మధ్య కూంబింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అయితే మలంగేర్ ఏరియాలో భారీ ఆయుధాలతో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందడంతోనే ఈ ఆపరేషన్ చేపట్టినట్లు పేర్కొన్నారు. గుమోడి దండకారణ్య ఆదివాసీ కిసాన్ మజ్దూర్ సంఘ్లో నందా యాక్టివ్ మెంబర్గా పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. నందాను కోర్టులో హాజరు పరిచిన అనంతరం జైలుకు తరలించారు.