న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్(Nawab Malik)కు .. ఇవాళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. మెడికల్ గ్రౌండ్స్పై తాత్కాలిక బెయిల్ జారీ చేశారు. ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ను 2022 ఫిబ్రవరిలో ఈడీ అరెస్టు చేసింది. ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంతో లింకున్న కేసులో ఆయన మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ అనిరుద్ బోస్, బేలా త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాలను సుప్రీం కొట్టిపారేసింది. రెండు నెలల పాటు బెయిల్ ఇచ్చారు. మార్కెట్ రేటు కన్నా తక్కువ ధరకే విలువైన భూముల్ని కొనుగోలు చేసినట్లు నవాబ్ మాలిక్పై ఈడీ ఆరోపణలు చేసింది.