ముంబై: మహారాష్ట్రలోని అమరావతి ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా తమ తీరుతో మరోసారి వార్తల్లో నిలిచారు. నిమజ్జనం సందర్భంగా గణేష్ విగ్రహాన్ని మురికి నీటిలో ఎత్తి పడేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వారి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి మద్దతుగా ఉన్న ఎంపీ నవనీత్ రాణా, ఆమె భర్త రవి రాణా కలిసి మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా పఠనానికి పిలుపునివ్వడం వివాదస్పదమైంది. నాటి నుంచి ఈ దంపతులు తరచుగా హిందుత్వ ఎజెండాతో వార్తల్లో నిలిస్తున్నారు. తాజాగా గణేష్ విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయకుండా నిర్లక్ష్యంగా నీటిలో పడేశారు. ఆ నీరు కూడా మురికిమయంగా ఉంది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఎంపీ నవనీత్ రాణా దంపతుల తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వ కాంట్రాక్టర్ల తీరు ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఇదే పనిని మరొకరు చేసి ఉంటే ఆమెతోపాటు బీజేపీ పెద్ద సమస్యగా మార్చేవని ఆరోపించారు. వినాయకుడ్ని, హిందూ మతాన్ని అవమానించినందుకు వారిపై కేసు నమోదు చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు.
మరోవైపు శివసేన నాయకురాలు సుష్మా అంధారే కూడా ఎంపీ నవనీత్ రాణా తీరుపై మండిపడ్డారు. మతం పేరుతో ఆమె ప్రారంభించిన హింసను అరికట్టాలని అన్నారు. హిందుత్వం పేరుతో ఆమె నిరంతరం గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. గణేష్ విగ్రహాన్ని ఎలా నిమజ్జనం చేయాలో వారికి తెలియదా? అని ప్రశ్నించారు. అందరి దృష్టిలో ఉండడానికి ఆమె ఇలా చేస్తున్నదని ఆరోపించారు.
Use this to target navneet Rana the bjp loose talker how she is hurting the sentiments of Hindus pic.twitter.com/rHXLgbtGab
— RadheyShyam BharatJodo (@rsdaroga) September 10, 2022