న్యూఢిల్లీ: మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ(Navjot Singh Sidhu).. తన భార్య నవజ్యోత్ కౌర్ ఫోటోలను షేర్ చేశారు. నవజ్యోత్ కౌర్ క్యాన్సర్తో బాధపడుతోంది. బెడ్పై రెస్టు తీసుకుంటున్న ఆమెకు భోజనం తినిపిస్తున్న ఫోటోను సిద్దూ షేర్ చేశారు. అయిదోసారి కీమో సెషన్కు తన భార్య హాజరైనట్లు సిద్దూ తెలిపారు. త్వరగా కోలుకునేందుకు ఆమెను మనాలీ తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు.
నవజ్యోత్ కౌర్ కు స్టేజ్ 2 ఇన్వేసివ్ క్యాన్సర్ను మార్చిలో గుర్తించారు. ఆమెకు సర్జరీ చేశారు. గాయాలు మానాయని, కానీ మానసికమన మరకలు ఉండిపోయానని, ప్రస్తుతం ఫిఫ్త్ కీమో జరుగుతోందని సిద్దూ తన పోస్టులో తెలిపారు. చేయి కదిపేందుకు ఇబ్బందిపడుతున్న తన భార్యకు స్పూన్తో అన్నం తినిపిస్తున్నట్లు సిద్దూ తన పోస్టులో చెప్పారు.
The wounds have healed but the mental scars of this ordeal will remain. Fifth chemo underway…. finding a good vein went all in vain for sometime and then Dr. Rupinder’s expertise came handy….. She refused to move her arm so spoon fed her….
Keeping in view massive vascular… pic.twitter.com/y4EF9OHWUj
— Navjot Singh Sidhu (@sherryontopp) August 9, 2023
ఇటీవల 10 నెలల పాటు సిద్దూ జైల్లో ఉండి వచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 2022లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సిద్దూ రాజీనామా చేశారు.