Vinesh Phogat : పారిస్ ఒలింపిక్స్లో భారత్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెజ్లింగ్ ఫైనల్కు (Indian wrestler) చేరిన వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) పతకం ఆశలు ఆవిరయ్యాయి. అధిక బరువు కారణంగా ఆమెపై అనర్హత వేటు పడింది. నంబర్ వన్ రెజ్లర్ సుసాకిపై విజయం సాధించి ఫైనల్కు చేరిన ఫొగాట్పై అనర్హత వేటు పడటం సర్వత్రా షాక్కు గురి చేస్తోంది. మరోవైపు దేశం యావత్తూ వినేశ్ వెంట నిలిచి సంఘీభావం ప్రకటించింది.
ఇక ఈ అనుభవంతో వినేశ్ ఫొగాట్ మరింత దృఢంగా మారుతుందని బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ అన్నారు. సిల్వర్ మెడల్ సాధించిన వారికి అందించే సదుపాయాలన్నీ వినేశ్కు కల్పిస్తామని హరియాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఈ సౌకర్యాలన్నింటినీ ఆమెకు సమకూరుస్తారని చెప్పారు. వినేశ్ తమ బిడ్డని, ఆమె చాలా సంకల్పబలం కలిగిన మహిళని కొనియాడారు.
ఆమె రెజ్లింగ్ నుంచి రిటైర్ కాబోరని, భవిష్యత్లో తమ బిడ్డ మరింత గట్టిగా పోరాట పటిమ ప్రదర్శిస్తుందని నవీన్ జిందాల్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, వినేశ్ ఫొగాట్పై ఒలింపిక్స్లో అనర్హత వేటు పడటం విచారకరమని రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ ఎంపీ హనుమాన్ బెనివల్ అన్నారు. మనకు మెరుగైన అంతర్జాతీయ సంబంధాలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారని, అలా అయితే వినేష్ విషయంలో ఇలా ఎందుకు జరిగిందని ఆయన ప్రశ్నించారు.
Read More :
NGT: కాజిరంగా పార్క్ వద్ద ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణం.. సుమోటో కేసు దాఖలు చేసిన ఎన్జీటీ