Sonia Gandhi | నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరవనున్నారు. మంగళవారం విచారణకు హాజరుకావాలని సోనియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆమె మధ్యాహ్నం వరకు విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా రాజ్ఘాట్ చుట్టూ 144 సెక్షన్ విధించారు.
ఇంతకు ముందు ఈ కేసులో ఈడీ ఈ నెల 21న సోనియాను రెండుగంటలకుపైగా ప్రశ్నించింది. ఈడీ అడిగిన 28 ప్రశ్నలకు సమాధానమిచ్చారు. కాంగ్రెస్కు చెందిన నేషనల్ హెరాల్డ్ యాజమాన్యంలోని యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణ జరుపుతున్నది. ఇవాళ ఈడీ విచారణకు సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉన్నది.