న్యూఢిల్లీ: వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి భద్రతా హెచ్చరికలను విస్మరించి అంతరిక్ష కేంద్రానికి సునీతా విలియమ్స్ను పంపినట్టు నాసా పరోక్షంగా అంగీకరించింది. దీనిని గతంలో జరిగిన కల్పనా చావ్లా దుర్ఘటన కేటగిరీ ప్రమాదంగా పేర్కొంది. ఎనిమిది రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో ఉండేందుకు బోయింగ్ స్టార్లైనర్ అంతరిక్ష నౌక ద్వారా రోదసిలోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ అక్కడ ఇంచుమించు ఏడాది పాటు (286 రోజులు) ఉండాల్సి వచ్చింది.
ఈ మిషన్ ఇంజనీరింగ్ పరంగా, నాయకత్వ పరంగా వైఫల్యమని నాసా వర్గీకరించింది. 2003లో కొలంబియా స్పేస్ షటిల్ విషాదం కూడా ఇదే విభాగానికి చెందినది. ఆ ప్రమాదంలో భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.