Nano Urea | న్యూఢిల్లీ: నానో యూరియా ప్లస్ ఎరువును మే 1 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంచుతామని ఇఫ్కో సోమవారం ప్రకటించింది. దీని ఉత్పత్తి ఈ వారం నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. పంటలు ఎదిగేటపుడు ముఖ్యమైన సమయాల్లో నత్రజని అవసరాలను తీర్చేందుకు నానో యూరియా ప్లస్ ఉపయోగపడుతుందని తెలిపింది.
నానో యూరియాను ఆధునికీకరించి తయారు చేస్తున్నదే నానో యూరియా ప్లస్ ఎరువు. ప్రస్తుతం 1-5 శాతం వెయిట్ బై వెయిట్ నత్రజనితో కూడిన నానో యూరియాను అందిస్తున్నది. నానో యూరియా ప్లస్లో నత్రజని 16 శాతం వెయిట్ బై వెయిట్ ఉంటుంది.