న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: ఉగ్రవాదుల కదలికల్ని రహస్యంగా పసిగట్టడమే కాదు, బాంబులు వేసి వాళ్లను అంతమొందించే ‘నానో డ్రోన్స్’ను ఐఐటీ-రూర్కీకి చెందిన యువ ఇంజినీర్లు తయారుచేశారు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ నిర్వహించగలిగే ‘కామికాజే’ వెర్షన్ (పేరు పరుష్) నానో డ్రోన్స్ సహా మూడు వేరియెంట్స్ను ఇంజినీర్ల బృందం అభివృద్ధి చేసింది. ఉగ్రవాది దాక్కున్న చోటకు వెళ్లి మరీ బాంబు దాడి చేసి వస్తుందని డిఫెన్స్ స్టార్టప్ సంస్థ ఐడీఆర్ పేర్కొన్నది. అత్యవసర సమయాల్లో సైన్యం వీటిని కేవలం 10 సెకన్లలో ప్రయోగించగలదని ఐడీఆర్ సహ వ్యవస్థాపకుడు మ యాంక్ ప్రతాప్ సింగ్ చెప్పారు. తొలి దేశీయ నానో డ్రోన్స్ ఇవి.