ముంబై : మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ పరస్పరం చేసుకున్న ఆరోపణలకు కట్టుబడి ఉండాలని, వారు లేవనెత్తిన అంశాలు చాలా తీవ్రమైనవని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలె అన్నారు. వారిద్దరూ ఒకరిపై ఒకరు అండర్వరల్డ్ మాఫియాతో సంబంధాలున్నాయనే ఆరోపణలు చేసుకున్నారని , ఉన్నతస్ధాయిలో ఉన్న వ్యక్తులైన వారి పరస్పర ఆరోపణలు చాలా తీవ్రమైన వ్యవహారమని అన్నారు.
వీరి ఆరోపణలతో మహారాష్ట్ర ప్రతిష్ట దెబ్బతింటోందని, ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో లేవనెత్తుతుందని నానా పటోలె బుధవారం స్పష్టం చేశారు. వారిద్దరూ తమ ఆరోపణలను నిరూపించలేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్రూయిజ్ పార్టీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్సీబీని డిమాండ్ చేస్తోందని చెప్పారు.