న్యూఢిల్లీ: చంద్రుడిపై అడుగుపెట్టాలన్న భారత్ కల సాకారానికి దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి ఆధ్వర్యంలో అంకురార్పణ జరిగిందన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు. చంద్రయాన్ పేరును కూడా ఆయనే సూచించారు. అంతకుముందు దీని పేరు సోమయాన్గా ఉండేది. వాజ్పేయి ప్రధానిగా ఉన్న 1999లో ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. ప్రాజెక్టు పేరును చంద్రయాన్గా మార్చారు. వాజ్పేయి నిర్ణయం అప్పట్లో శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.