ప్రయాగ్రాజ్ (యూపీ), నవంబర్ 22: పదవీ విరమణ వీడ్కోలు సందర్భంగా అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రీతింకర్ దివాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని కొలీజయం వేధింపులలో భాగంగానే తనను ఛత్తీస్గఢ్ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్టు ఆయన ఆరోపించారు.
2018 నుంచి హైకోర్టులో జడ్జీగా పనిచేస్తుండగా ఈ ఏడాది సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం తనను అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా సిఫార్సు చేసిందన్నారు. దీంతో తాను ఈ ఏడాది మార్చిలో ఆ ఉన్నత పదవిని చేపట్టానంటూ చంద్రచూడ్కు కృతజ్ఞతలు తెలిపారు.