లక్నో: తన సోదరి మరణించినప్పటికీ తనకు సెలవు మంజూరు చేయలేదని ఒక పోలీస్ కానిస్టేబుల్ (UP constable emotional video ) ఆవేదన చెందాడు. పోలీసుల ఆత్మహత్యలకు కారణం తెలుసా? అని ప్రశ్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. బాగ్పత్ పోలీస్ స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ ఓంవీర్ సింగ్, తన బాధను ఒక వీడియో ద్వారా పంచుకున్నాడు. పోలీసు సిబ్బంది ప్రాణాలను డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదని ఆరోపించాడు.
పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను హైలైట్ చేయడమే తన వీడియో ఉద్దేశమని ఓంవీర్ సింగ్ తెలిపాడు. ‘గత రెండేళ్లలో యూపీలో కనీసం 10 నుంచి12 మంది పోలీస్ కానిస్టేబుళ్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే దీనిపై అధికారులెవరూ స్పందించలేదు. నిన్న కూడా అయోధ్య, మీరట్లో ఇద్దరు పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఎవరైనా ఆలోచించారా?’ అని ప్రశ్నించాడు.
కాగా, జూలై 20న తన సోదరి చనిపోయినట్లు పోలీస్ కానిస్టేబుల్ ఓంవీర్ సింగ్ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే తనకు సెలవు మంజూరు చేయలేదని, తాను చాలా బాధపడ్డానని చెప్పాడు. మూరుమూల ప్రాంతాల్లో పోస్టింగ్లు వేస్తున్నారని ఆరోపించాడు. ఈ స్కీమ్ను తొలగించాలని వేడుకున్నాడు. అలా చేస్తే తమ కుటుంబాల సమీప ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ వారి బాగోగులను చూసుకునేందుకు వీలు కలుగుతుందని వాపోయాడు. ఒక వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Video of UP police constable Omveer Singh from Baghpat has surfaced on social media. Directs attention towards the cases of suicide by cops. "I am hurt because my sister died on July 20. My leave was not approved," he said. pic.twitter.com/hGOudoOVHx
— Piyush Rai (@Benarasiyaa) August 27, 2023