హైదరాబాద్ : భవనం పైనుంచి పడి కార్మికుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
నగరంలోని బంజారాహిల్స్ బోలానగర్లో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. బోలానగర్లో నిర్మాణంలో ఉన్న భవనంలో పనిచేసేందుకు కార్మికులు వచ్చారు.
పనిచేస్తుండగా ముగ్గురు కార్మికులు ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడ్డారు. తీవ్రగాయాలై వీరిలో ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
బాధితులను చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతి చెందిన వ్యక్తిని షన్ను (25)గా గుర్తించారు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.