యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. తమ పిల్లల ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగి సర్కార్కు పనేమీ లేనట్టుంది అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. నేతల ఫోన్లను యోగి సర్కార్ ట్యాప్ చేస్తోందంటూ వచ్చిన వార్తలపై స్పందించాల్సిందిగా కోరినప్పుడు ప్రియాంక పై విధంగా స్పందించారు. తమ ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, ప్రతి రోజూ సాయంత్రం ఆ రికార్డులను వింటోందని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం తీవ్ర ఆరోపణలు చేసిన విషయం విదితమే.