కోల్కతా, జనవరి 9: ప్రముఖ గాయకుడు, హిందూస్థానీ సంగీతకారుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) మంగళవారం కోల్కతాలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన నాలుగేండ్లుగా ప్రొస్టేట్ క్యాన్సర్తో పోరాడుతున్నారు. రామ్పూర్-సహస్వాన్ సంగీత పాఠశాల వ్యవస్థాపకుడైన ఇనాయత్ హుస్సేన్కు రషీద్ ఖాన్ ముని మనుమడు. రషీద్ ఖాన్ మృతి దేశానికి, సంగీత సమాజానికి తీరని నష్టమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. రషీద్ ఖాన్ మరణించిన విషయాన్ని తానింకా నమ్మలేకపోతున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు.