జైపూర్: రాజస్థాన్లోని బిల్వారాలో బుధవారం రాత్రి మర్డర్ జరిగింది. 22 ఏళ్ల వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల రాజస్థాన్ అల్లర్లు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో బిల్వారాలో ఇవాళ ఇంటర్నెట్ను బంద్ చేశారు. కోటావాలీ పోలీసు స్టేషన్ పరిధిలో హత్య జరిగింది. ఈ నేరానికి సంబంధించి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. అతివాద సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. ఇటీవల కరౌలీ, అల్వార్, జోధ్పూర్ పట్టణాల్లో మత కలహాలు చోటుచేసుకున్న నేపథ్యంలో బిల్వారాలో ఇంటర్నెట్ను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పోలీసులు పట్టణంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఆశిశ్ మోదీ తెలిపారు.