మంత్రి ఆదిత్య థాకరేకు బెదిరింపు మెసేజ్లు పంపుతున్న వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైసింగ్ రాజ్పుత్ డిసెంబర్ 8న మంత్రి ఆదిత్యకు కాల్ చేశారని, ఆయన లిఫ్ట్ చేయకపోవడంతో బెదిరింపులతో ఉన్న ఓ మెసేజ్ను పంపారని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మాట్లాడుతూ.. ‘మంత్రి ఆదిత్యకు బెదిరింపు మెసేజ్లు పంపిన వ్యక్తి పేరు జైసింగ్ రాజ్పుత్. ఆయన్ను కర్నాటకలో ముంబై క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైకి తీసుకొచ్చారు’. అని ప్రకటించారు. మరోవైపు ప్రజా ప్రతినిధులకు వచ్చే బెదిరింపు కాల్స్, మెసేజ్లను పరిశీలించే నిమిత్తమై తాము ఓ సిట్ను ఏర్పాటు చేస్తున్నామని, వీటిని గమనిస్తూ ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.