బాంబే హైకోర్టు స్పష్టీకరణ
ముంబై: జాతకాలు కలువలేదన్న సాకుతో పెండ్లికి నిరాకరించరాదని బాంబే హైకోర్టు స్పష్టంచేసింది. నిందితుడిపై నమోదైన మోసం, లైంగికదాడి కేసులను కొట్టేయడానికి నిరాకరించింది. మహారాష్ట్రలోని బద్లాపూర్కు చెందిన అవిషేక్ మిత్రా.. అదే పట్టణానికి చెందిన తన స్నేహితురాలితో కొంతకాలంగా సన్నిహితంగా మెదిలాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. బాధితురాలు పెండ్లి ప్రస్తావన తీసుకురాగానే ముఖం చాటేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు 2012లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై లైంగికదాడి, మోసం కేసు పెట్టింది. పోలీసులు ఇరువర్గాలను కౌన్సెలింగ్కు పిలిచి మాట్లాడారు. దీంతో బాధితురాలిని పెండ్లి చేసుకుంటానని పోలీసుల ముందు చెప్పిన నిందితుడు ఆ తర్వాత మాటమార్చాడు. ఈ కేసును బాంబే హైకోర్టు విచారించింది. జాతకాలు కలువలేదన్న నెపంతో పెండ్లికి నిరాకరించడాన్ని ఒప్పుకోబోమన్నది. పోలీసుల కౌన్సెలింగ్లో బాధితురాలిని పెండ్లి చేసుకుంటానని నమ్మించి, నిందితుడు మాట తప్పాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.