ముంబై: క్రూయిజ్ షిప్లో రేవ్ పార్టీకి సంబంధించిన కేసులో ముంబై కోర్టు మరో నలుగురికి ఎన్సీబీ కస్టడీ విధించింది. కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులు మంగళవారం సాయంత్రం కూడా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వాళ్లను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వాళ్లకు ఈ నెల 14 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించింది. కొత్తగా ఎన్సీబీ కస్టడీకి వెళ్లిన వాళ్లలో గోపాల్ జీ ఆనంద్, సమీర్ సెహగల్, మానవ్ సింఘాల్, భాస్కర్ అరోరా ఉన్నారు.
కాగా, ఇవాళ ఎన్సీబీ కస్టడీకి వెళ్లిన నలుగురు నిందితులూ క్రూయిజ్ షిప్లో రేవ్పార్టీ నిర్వహించిన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన వాళ్లని ఎన్సీబీ అధికారులు తెలిపారు. నిన్న ఉదయం కూడా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చెందిన నలుగురిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వాళ్లను నిన్ననే కోర్టులో హాజరుపర్చగా ఈ నెల 11 వరకు ఎన్సీబీ కస్టడీ విధించింది. కాగా ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 16 మంది అరెస్టయ్యారు.