ముంబై, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టాలని ముంబై బీఆర్ఎస్ శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ శ్రేణులు సంతకాల సేకరణ చేపట్టాయి. కొత్త పార్లమెంట్కు అంబేదర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
సంతకాల సేకరణ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముంబై నాయకులు హేమంత్ కుమార్, థాణే జిల్లా కోఆర్డినేటర్ మక్సుద్ ఖాన్, లోక్సభ కోఆర్డినేటర్ రవీంద్ర, ముంబై సిటీ కో కోఆర్డినేటర్ దేవానంద్, చందివలి విధాన సభ కోఆర్డినేటర్ రమేశ్ వల్, లక్ష్మణ్, సత్యనారాయణ పద్మశాలి, నర్సింగ్ ఒటర్, బద్ది గోపాల్, ముకేశ్ తదితరులు పాల్గొన్నారు.