ముంబై : దయాగుణం కలిగిన వారు నలుగురిలో ఉన్నా తమ ప్రత్యేకతను, ఔదార్యాన్ని చాటుకుంటారు. ముంబైలోని ఓ ఆటోవాలా తన వాహనంలో వాటర్ బాటిల్స్ను ఉంచి ప్రయాణీకులకు ఉచితంగా ఇస్తున్న ఉదంతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆటోవాలా గొప్ప మనసును చాటే పోస్ట్ను (viral post) నందినీ అయ్యర్ ట్విట్టర్లో షేర్ చేశారు.
Gesture Matters ☺️
Mumbai autowala giving free water . It’s immensely satisfying to see. #SpreadKindness ✌🏼 pic.twitter.com/M2nVrLPJQg— NANDINI IYER (@123_nandini) April 3, 2023
ఆటోవాలా దయాగుణం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫొటోలో ఆటో లోపల ప్రయాణీకుల కోసం కొన్ని వాటర్ బాటిల్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటిని ఆ వ్యక్తి ప్రయాణీకులకు ఉచితంగా ఇవ్వడం అతడి దయాగుణానికి అద్దం పడుతోంది. ముంబై ఆటోవాలా ఉచితంగా మంచి నీరు అందిస్తున్నాడు..ఇది చూడటానికి ఎంతో సంతృప్తిగా అనిపిస్తోంది…దయాగుణాన్ని వెదజల్లుదాం అని పోస్ట్కు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ పోస్ట్ను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 17.5 వేల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. ఇలాంటి చిన్న విషయాలు సైతం ప్రయాణీకుల ముఖంపై చిరునవ్వులు పూయిస్తాయని పలువురు యూజర్లు కామెంట్ చేశారు. ఆటో డ్రైవర్ దయాగుణాన్ని కొందరు యూజర్లు కొనియాడారు. ఈ ముంబై ఆటోవాలా స్టోరీ ఎందరో హృదయాలను తాకింది.
Read More