ముంబైముంబై : మహారాష్ట్ర ముంబైలోని బాంద్రా (ఈస్ట్)లో ఘోర ఘటన చోటు చేసుకున్నది. ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. బెహ్రామ్నగర్ ప్రాంతంలో ఘటన చోటు చేసుకోగా.. శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 3.50 గంటల సమయంలో సంఘటన చోటు చేసుకుంది. ఆరుగురిని అధికారులు రక్షించి, ఆసుపత్రికి తరలించారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం, పోలీసులు సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ఆరు అంబులెన్స్లు, ఐదు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించినట్లు అధికారులు పేర్కొన్నారు. భవనం కూలడానికి గల కారణాలు తెలియరాలేదు.